Rayachoty: రాయచోటి వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి.

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్రస్వామిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Updated on: 4 Aug 2026 1:12 PM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి.

రాయచోటి. అన్నమయ్య జిల్లా

భద్రకాళి సమేత వీరభద్రస్వామిని సతీసమేతంగా దర్శించుకున్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల *మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆలయానికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా భక్తులు మంత్రి కృతజ్ఞతలు తెలియజేసి ఆనందం వ్యక్తం చేశారు.ఆనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి, ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ఆశీర్వచనాలు అందించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story