Pulivendula: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు అవినాష్ డిమాండ్!
Pulivendula: డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ కోరుతూ పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ. మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్.
Pulivendula: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు అవినాష్ డిమాండ్!
Pulivendula: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కామెంట్స్, డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. ర్యాలీకి ఆంక్షలు పెట్టినా వేలాది మంది యువత పాల్గొన్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి డీఎస్సీ అక్రమాలు, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరపాలి.
ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి చెల్లించాలి ,26 నెలల బకాయి రూ.78 వేలు ప్రతి యువకుడికి చెల్లించాలి : అవినాష్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలి,ఫీజు బకాయిలతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆరోపణ,ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలు అమలు చేయాలి.
డీఎస్సీ-2025లో 3.30 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని ఆరోపణ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా జీవోలపై తీవ్ర అభ్యంతరం, జీవోలు జారీ చేసి మళ్లీ రద్దు చేయడం ఎందుకని ప్రశ్న. డీఎస్సీ అభ్యర్థులతో లోకేష్ బహిరంగ చర్చకు రావాలి. రామగోపాల్ రెడ్డి కూడా డీఎస్సీ అభ్యర్థులతో చర్చకు సిద్ధం కావాలి, డీఎస్సీ అక్రమాలపై బాధ్యత వహించి లోకేష్ రాజీనామా చేయాలి.
పేపర్ లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి, సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి.ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్-సెవెన్ హామీలు అమలు చేయాలి.
యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు: అవినాష్ రెడ్డి.




