Mydukur: మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజాదర్బార్!

Mydukur: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 14 May 2026 5:03 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రజాదర్బార్!

మైదుకూరు: మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామీణ మరియు అభివృద్ధి సంబంధిత సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించిన ఎమ్మెల్యే గారు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తూ సంబంధిత శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గారు తెలిపారు. ప్రజల సంక్షేమం మరియు నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story