Chinnamandem: డీలర్ పెంచలయ్య తల్లి మృతి పరామర్శించిన నాగిరెడ్డి!
Chinnamandem: చిన్నమండెం మండలం గుట్టకిందపల్లెలో డీలర్ పెంచలయ్య తల్లి లక్ష్మీదేవి భౌతికకాయానికి నిశ్చల్ నాగిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
Chinnamandem: డీలర్ పెంచలయ్య తల్లి మృతి పరామర్శించిన నాగిరెడ్డి!
Chinnamandem: చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామం గుట్టకిందపల్లెకు చెందిన డీలర్ కంబళ్ల పెంచలయ్య గారి తల్లి లక్ష్మీదేవి గారు మృతి చెందడంతో, ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మీదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప గారు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Next Story




