Ramapuram: మూలస్థానేశ్వర స్వామి శివాలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం!
Ramapuram: రామాపురం మండలం హసనాపురం శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందించిన దాతలు సాధనపు వెంకట రమణ ఆచారి, లక్ష్మీదేవి.
Ramapuram: మూలస్థానేశ్వర స్వామి శివాలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం!
Ramapuram: రామాపురం మండలం హసనాపురం గ్రామంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి శివాలయ అభివృద్ధికి దాత రూ.లక్ష విరాళంగా అందించారు. ఆలయ అభివృద్ధికి సాధనపు వెంకట రమణ ఆచారి, శ్రీమతి లక్ష్మీదేవి తమ వంతు సహకారం అందించిన దాతకు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం దాతకు తీర్థప్రసాదాలు అందజేసి, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
Next Story




