Kadapa: కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ బస్సు, పలువురికి గాయాలు!
Kadapa: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పి.పి.కుంట వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా పడింది.
Kadapa: కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. బోల్తా పడిన ప్రైవేట్ బస్సు, పలువురికి గాయాలు!
వైఎస్సార్ కడప జిల్లా: గోపవరం మండలం పి.పి.కుంట సమీప అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు మరియు పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ల ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




