Rayachoti: వైయస్సార్సీపీకి షాక్.. టీడీపీలోకి ఎస్. బాలసుబ్రమణ్యం!
Rayachoti: రాయచోటిలో వైయస్సార్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ నలంద పాఠశాల కరస్పాండెంట్ ఎస్. బాలసుబ్రమణ్యం టీడీపీలో చేరారు.
Rayachoti: వైయస్సార్సీపీకి షాక్.. టీడీపీలోకి ఎస్. బాలసుబ్రమణ్యం!
Rayachoti: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి టిడిపిలో చేరిన ఎస్ బాలసుబ్రమణ్యం గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. లక్కిరెడ్డిపల్లి కు చెందిన ఎస్ బాలసుబ్రమణ్యం గారు(శ్రీ నలంద విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్) తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమ పథకాలను, చూసి, రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మంత్రివర్యులు మండిపల్లె రాంప్రసాద్ గారి నాయకత్వం చూసి, పార్టీ విధి విధానాలు నచ్చి ఈరోజు రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయముకు వెళ్లి మంత్రివర్యులు సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోవడం జరిగింది.
Next Story




