Rayachoti: రాయచోటిలో వైఎస్సార్సీపీ బిఎల్ఏల సదస్సు
Rayachoti: రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి నేతృత్వంలో బిఎల్ఏల కీలక అవగాహన సదస్సు.
Rayachoti: రాయచోటిలో వైఎస్సార్సీపీ బిఎల్ఏల సదస్సు
రాయచోటి: ఎస్ఐఆర్ పై ఉన్న అపోహలను తొలగించడానికి బిఎల్ఏలను ఏర్పాటు చేసుకున్నామని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ఎలా రక్షించుకోవాలి, ఓట్ల విషయంలో ప్రభుత్వం స్వార్ధంగా వ్యవహరిస్తే తప్పకుండా పోరాడతామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి లు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్ఐఆర్ పై వైసీపీ బిఎల్ఏలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయచోటి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎల్ఏలు అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు.
Next Story




