Rayachoty: కలిబండ పెద్ద చెరువు పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ
Rayachoty:
Rayachoty: కలిబండ పెద్ద చెరువు పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం,కలిబండ గ్రామంలో కలిబండ పెద్ద చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి మండిపల్లి హరితమ్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడి వ్యవసాయానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి పనిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప స్థానిక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,మండిపల్లి అభిమానులు,గ్రామ పెద్దలు, రైతులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Next Story




