Mydukur: కేసీ కెనాల్పై చంద్రబాబే ప్రకటన చేయాలి ఏవీ రమణ డిమాండ్!
Mydukur: ఖరీఫ్ సీజన్లో కేసీ కెనాల్ నుంచి వరి లేదా ఆరుతడి పంటలకు ఏ విధానంలో సాగునీరు విడుదల చేస్తారో సీఎం చంద్రబాబు స్పష్ట ప్రకటన చేయాలని రైతు సేవా సమితి కోరింది.
Mydukur: కేసీ కెనాల్పై చంద్రబాబే ప్రకటన చేయాలి ఏవీ రమణ డిమాండ్!
Mydukur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కర్నూలు, కడప ఉమ్మడి జిల్లాల సాగునీటి ప్రాజెక్టు అయిన కేసి.కెనాల్ కాలువ నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఏవిధానంతో పంటలకు నీటీని విడుదల చేస్తున్నామనేది వరి పంటకు విడుదల చేస్తున్నారా, ఆరుతడి పంటలకు విడుదల చేస్తున్నారా అనే విషయంపై జిల్లా, మండల స్థాయి అధికారులతో కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే స్పష్టమైన ప్రకటన చేయాలని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ, సమితి మైదుకూరు మండల నాయకులు మూలె వెంకట చంద్రారెడ్డిలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరారు.
Next Story




