Rayachoti: శబరిమల విభూతి, కాశీ శంఖాలతో రాయచోటి గుడిలో ప్రత్యేక పూజలు!
Rayachoti: రాయచోటి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానానికి శబరిమల క్షేత్రం నుండి తెచ్చిన 5 కేజీల పవిత్ర విభూతి, గంధాన్ని ఆలయ చైర్మన్ సమర్పించారు.
Rayachoti: శబరిమల విభూతి, కాశీ శంఖాలతో రాయచోటి గుడిలో ప్రత్యేక పూజలు!
అన్నమయ్య జిల్లా: రాయచోటి పట్టనము నందు వెలసిన శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము నకు ఆలయ ఛైర్మెన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారు శబరిమల నుండి 5 కిజిల విభూతి, గంధం తెచ్చి స్వామి, అమ్మవారికి, మరియు సమూహ దేవస్థానములకు అందజేశారు, కమిటీ సభ్యులు శ్రీ కారంశెట్టి గిరి గారు 2 శంఖములు కాశి నుండి తీసుకొని వచ్చి శ్రీ వీరభద్రస్వామి వారికి, శ్రీ ఆఘోరలింగేశ్వర స్వామి వారికి అందజేశారని శాశ్వత అన్నదానం పూజలకు రూ.30,00,000/-, శాశ్వత పూజలకు రూ.30,00,000/- మొత్తం రూ. 60,00,000/- ఫిక్స్డ్ డిపాజిట్ చేశారాని ఆలయ ఛైర్మెన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారు, పాలకమండలి సభ్యులు శ్రీమతి యం.రెడ్డమ్మ గారు, శ్రీ కే.రవి శంకర్ గారు, శ్రీ జి. నాగేశ్వర్లు గారు, శ్రీమతి బి. సుభారతి గారు, శ్రీమతి కే. నాగమణి గారు, శ్రీ టి. యస్. రమణారావ్ గారు, శ్రీ ఓ.సుబ్రహ్మణ్యం గారు, శ్రీ కే. గిరి గారు, శ్రీమతి బి. రామాదేవి గారు, శ్రీమతి రణెమ్మ గారు మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ డి.వి.రమణారెడ్డి గారు తెలియజేశారు.




