Rayachoti: రాయచోటి ప్రసన్నాంజనేయ ఆలయంలో శ్రావణ శనివారం అన్నదానం
Rayachoti: రాయచోటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం వేడుకలు. అన్నదానంలో పాల్గొన్న టీటీడీ మాజీ బోర్డు మెంబర్ సుగవాసి ప్రసాద్ బాబు.
Rayachoti: రాయచోటి ప్రసన్నాంజనేయ ఆలయంలో శ్రావణ శనివారం అన్నదానం
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి గాలివీడు రోడ్డులోని పవిత్ర శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా మాండవ్య నది ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
టీడీపీ నాయకులు మన్నేరు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ “అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం భగవంతునికి నైవేద్యం సమర్పించినట్లే” అన్నారు. శ్రావణమాసంలో ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు భక్తిభావాన్ని, సేవాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
Next Story




