Annamayya: షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య.. అన్నమయ్య జిల్లాలో విషాదం!

Annamayya: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో విషాదం నెలకొంది. షుగర్ మాత్రలు మింగి కె. మునెమ్మ (45) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

Srinivasulu, Madanapalle
Updated on: 4 May 2026 12:06 PM IST
Annamayya
X

Annamayya: షుగర్ మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య.. అన్నమయ్య జిల్లాలో విషాదం!

అన్నమయ్య జిల్లా: జిల్లాలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలం ఆర్ కమతంపల్లెకు చెందిన వెంకటరమణ భార్య కె. మునెమ్మ (45) ఇంట్లో ఉన్న షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఘటనపై జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story