Pithapuram: పిఠాపురం కుక్కుటేశ్వరాలయంలో వరుణ జపాలు, మహా రుద్రాభిషేకం
Pithapuram: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం శ్రీ ఉమాకుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా వరుణ జపాలు, మహా రుద్రాభిషేకం నిర్వహించారు.
Pithapuram: పిఠాపురం కుక్కుటేశ్వరాలయంలో వరుణ జపాలు, మహా రుద్రాభిషేకం
Pithapuram: పిఠాపురం పట్టణం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి& శాసనసభ్యులు
కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశములు మేరకు,ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కోడూరు రామచందర్ మోహన్ ఆదేశానుసారం ఆలయ సహాయక కమిషనర్ సూచనలు మేరకు కార్యనిర్వాహణాధికారి కట్నం జగన్మోహన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లోక సంక్షేమం సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురియాలనే సంకల్పంతో
శ్రీ స్వామివారి దివ్య సన్నిధిలో ఘట్టాభిషేకం, వరుణ జపములు, మహా రుద్రాభిషేకం,బ్రహ్మశ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ బ్రహ్మత్వంలో ఆస్థాన పురోహిత, పండిత,అర్చక బృందములచే వేదోక్తముగా,ఆగమయుక్తంగా ఘనంగా నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో జనసేన ఫైన్ మాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు మరియు జనసేన నాయకులు భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వామివారి అనుగ్రహం పొందారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఫైన్ మాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు మరియు జనసేన నాయకులు ఆలయ సిబ్బంది వేద పురోహిత, పండిత, అర్చకలు తదితరులు పాల్గొన్నారు.




