Pithapuram: పిఠాపురం పడా కార్యాలయంలో ప్రోటోకాల్ వివాదం.. ఉద్రిక్తత

Pithapuram: పిఠాపురం పడా కార్యాలయంలో సీఎం ఫోటో వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

V. Ramakrishna, Pithapuram
Published on: 21 April 2026 12:57 PM IST
Pithapuram
X

Pithapuram

Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పడా (PADA) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. “సీఎం ఫోటో ఎక్కడ?” అంటూ అధికారులను బహిరంగంగా ప్రశ్నించారు. ప్రోటోకాల్‌ను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు.

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులపై నినాదాలు చేశారు. “ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య స్వల్ప తోపులాట కూడా జరిగింది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని వర్మ ఆరోపిస్తూ, ప్రోటోకాల్ పాటించడంలో వైఫల్యం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిందని విమర్శించారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story