Tuni: రైలు నుండి జారిపడి 35 ఏళ్ల యువకుడు దుర్మరణం?
Tuni: తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటికొప్పాక సమీపంలో రైలు పట్టాల పక్కన 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
Tuni: రైలు నుండి జారిపడి 35 ఏళ్ల యువకుడు దుర్మరణం?
తుని: తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటికొప్పాక సమీపంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విజయవాడ నుండి విశాఖపట్నం వైపు వెళ్లే రైలు మార్గంలో పట్టాల పక్కన సుమారు 35 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మరణించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే, మృతుడు ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన ఊరు, పేరు లేదా ఇతర వివరాలు ఏమీ తెలియరాలేదు.
మృతుడి ఆచూకీ:
వయస్సు: సుమారు 35 ఏళ్లు.
దుస్తులు: తెల్లని రంగు ఫుల్ హ్యాండ్ షర్టు మరియు బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నారు.
ప్రస్తుతం మృతదేహాన్ని తుని గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సత్తిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు లేదా వారి బంధువులు ఎవరైనా ఉంటే, తుని రైల్వే పోలీసులను నేరుగా సంప్రదించాలని లేదా 9247585731 అనే నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.




