Pithapuram: కూటమి 'వెన్నుపోటు' పాలనపై వైఎస్సార్సీపీ నిరసన
Pithapuram: వైఎస్ జగన్ పిలుపు మేరకు పిఠాపురంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర,
Pithapuram: కూటమి 'వెన్నుపోటు' పాలనపై వైఎస్సార్సీపీ నిరసన
Pithapuram: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం రెండేళ్ల వెన్నుపోటు పాలనను నిరసిస్తూ పిఠాపురంలో భారీ ఎత్తున పాదయాత్ర ర్యాలీ చేపట్టారు ఇంచార్జ్ వంగా గీత కూటమి ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపించారని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తానన్న డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రోజు అన్ని రంగాల వారిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చెంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు వంగా గీత. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




