Sircilla: అమృత్ పైప్‌లైన్ పనుల నిర్లక్ష్యం.. స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం!

Sircilla: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తా వద్ద అమృత్ స్కీం పైప్‌లైన్ పనుల నిర్లక్ష్యం వల్ల స్కూల్ బస్సు గుంతలో కూరుకుపోయింది.

KALEEM, SIRICILLA
Published on: 5 Aug 2026 7:58 PM IST
Sircilla
X

Sircilla: అమృత్ పైప్‌లైన్ పనుల నిర్లక్ష్యం.. స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం!

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట బైపాస్ చౌరస్తా వద్ద అమృత్ స్కీం కింద చేపట్టిన పైప్‌లైన్ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సు రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఇరుక్కుపోయి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం.. అమృత్ స్కీం కింద పైప్‌లైన్ వేసిన అనంతరం గుంతను సక్రమంగా మట్టితో పూడ్చకపోవడంతో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. అదే మార్గంలో వెళ్తున్న స్కూల్ బస్సు ఆ గుంతలో కూరుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు, డ్రైవర్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం తెలుసుకున్న స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సును బయటకు తీసేందుకు సహకరించారు. అందరూ కలిసి బస్సును పైకి లేపి సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

అమృత్ స్కీం పనులు పూర్తయిన తర్వాత రహదారిని సరిగా పునరుద్ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రహదారిని శాశ్వతంగా మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story