Sultanabad: సుల్తానాబాద్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sultanabad: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సుగ్లంపల్లి సింగిల్ విండో కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 21 April 2026 9:44 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sultanabad: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు గారు పేర్కొన్నారు. మంగళవారం సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని సుగ్లంపల్లి సింగిల్ విండో కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.

​రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను వినియోగించుకోవాలని ఆయన రైతులకు సూచించారు.

​పాల్గొన్న ముఖ్య నేతలు మరియు అధికారులు

​ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ​అధికారులు డిప్యూటీ కలెక్టర్, DSO శ్రీమల గారు. ​ప్రజా ప్రతినిధులు: సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక కౌన్సిలర్లు.

​ఇతరులు: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి, నిర్దేశించిన తేమ శాతంతో కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story