Peddapalli: హోమాలు చేస్తే నీళ్లు రావు రేవంత్ రెడ్డిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్!

Peddapalli: వరుణయాగాలు చేస్తే పుణ్యాలొస్తాయి తప్ప రైతులకు నీళ్లు రావు.

RAMESH, DHARMPURI
Published on: 20 July 2026 4:27 PM IST
Peddapalli
X

Peddapalli: హోమాలు చేస్తే నీళ్లు రావు రేవంత్ రెడ్డిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్!

Peddapalli: వరుణయాగాలు హోమాలు చేస్తే నీళ్లు రావు మీకు పుణ్యాలు వస్తాయి తప్ప రైతులకు నీళ్లు రావు అని మండిపడ్డ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని నంది రిజర్వాయర్ దగ్గర నాయకులతో కలసి క్రికెట్ మరియు కబడ్డీ ఆడి నిరసన తెలియ జేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. కాళేశ్వరం అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే కాళేశ్వరం కాళేశ్వరం నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అది కేసీఆర్ కు పెరు వస్తుందని ముఖ్యమంత్రి భయపడుతున్నాడు. హోమాలు వరుణయగాలు చేస్తే దేవుడికి మొక్కుతేనో నీళ్లు రావు. హోమాలు వరుణయాగాలు చేస్తే మీకు పుణ్యాలస్తాయి తప్ప రైతులకు నీళ్లు రావు. కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీటిని సరఫరా ప్రారంభించాలి. రిజర్వాయర్ లో నీళ్లు వస్తే రైతుల కష్టాలు తీరుతాయి. అనవసరంగా కేసీఆర్ పై కోపంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు రాకుండా చేస్తున్నాడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండి పడ్డాడు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI

Next Story