Kondagattu: కొండగట్టులో భక్తుల సందడి.. అంజన్నకు విశేష పూజలు

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 21 April 2026 5:41 PM IST
Kondagattu
X

Kondagattu: కొండగట్టులో భక్తుల సందడి.. అంజన్నకు విశేష పూజలు

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. అంజన్నకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ ఆంజనేయస్వామివారిని ప్రత్యేక పుష్పాలంకరణతో శోభాయమానంగా అలంకరించి, విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు, పూల మాలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పార్కింగ్, త్రాగునీరు, క్యూలైన్, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపట్టారు.

ఆలయ ఈవో అంజనారెడ్డి మాట్లాడుతూ, ప్రతి మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story