Jammikunta: వినాయక మండపాల నిర్వాహకులతో మున్సిపల్ చైర్మన్ సమావేశం
Jammikunta: జమ్మికుంటలో వినాయక మండపాల నిర్వాహకులు పోలీస్, విద్యుత్ శాఖల్లో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ సూచించారు.
Jammikunta: వినాయక మండపాల నిర్వాహకులతో మున్సిపల్ చైర్మన్ సమావేశం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో రానున్న వినాయక చవితి పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల నిర్వహుకలతో సమావేశమైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ..
జమ్మికుంట పట్టణ పరిధిలో ఏర్పాటు చేయనున్న మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫిస్ లో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు మీయొక్క మండపాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించిన గణనాధుని నిమర్జన ఊరేగింపు తొందరగా ప్రారంభించి అందరూ మీ మీ యొక్క గణనాధుని దర్శించుకుని ఉండాలని అందరూ సంతోషకరమైన వాతావరణంలో నిమర్జనం పూర్తయ్యల చూడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ గౌరవ కౌన్సిలర్స్,ACP మాధవి ,CI రామక్రిష్ణ,SI,మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ,MRO గడ్డం సుధాకర్,సానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, కరెంట్ డిపార్మెంట్ AE,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.




