Karimnagar: ధాన్యం తరలింపులో జాప్యం వద్దు: అధికారులను హెచ్చరించిన కలెక్టర్!

Karimnagar: కరీంనగర్ జిల్లా వన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. వర్షాల నేపథ్యంలో ధాన్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్న కలెక్టర్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 28 May 2026 10:11 AM IST
Karimnagar
X

Karimnagar: ధాన్యం తరలింపులో జాప్యం వద్దు: అధికారులను హెచ్చరించిన కలెక్టర్!

కరీంనగర్: వన్నారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ పురోగతిని పరిశీలించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంగళవారం రాత్రి రాత్రి కురిసిన వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిందా, ఏమైనా నష్టం జరిగిందా అని రైతులతో మాట్లాడి ఆరా తీశారు. అలాగే టార్పాలిన్లు అందుబాటు లో ఉన్నాయా, కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడవలేదని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు కలెక్టర్‌కు తెలిపారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story