Karimnagar: శాతవాహన వర్సిటీలో 'పీఎం-వీబీఆర్వై' వేడుకలు
Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన' (PM-VBRY) కార్యక్రమం ఘనంగా జరిగింది.
Karimnagar: శాతవాహన వర్సిటీలో 'పీఎం-వీబీఆర్వై' వేడుకలు
కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం అంబేద్కర్ కాన్ఫరెన్స్ హాల్లో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన' (PM-VBRY) ప్రాంతీయ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
దేశవ్యాప్తంగా రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాల పంపిణీలో భాగంగా జరిగిన ఈ వేడుకలో అర్హులైన నూతన ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఉపాధి కల్పన, సామాజిక భద్రత లక్ష్యంగా సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రిజిస్టర్ సతీష్, పిఎఫ్ కమిషనర్ మహ్మద్ పసివుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ బ్రిజేష్ కుమార్, వివిధ సంస్థలకు చెందిన యాజమాన్యాలు ఉద్యోగ నియామక పత్రాలు పొందిన ఉద్యోగులు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.




