Konerupally: భూముల రీ-సర్వే ప్రారంభం.. సరిహద్దు వివాదాలకు ఇక చెక్!

Konerupally: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లిలో భూ భారతి చట్టం కింద భూముల రీ-సర్వేను తహసీల్దార్ పి. నవీన్ కుమార్ ఆధునిక సాంకేతికతతో ప్రారంభించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 29 Jun 2026 4:41 PM IST
Konerupally
X

Konerupally: భూముల రీ-సర్వే ప్రారంభం.. సరిహద్దు వివాదాలకు ఇక చెక్!

Konerupally: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం, కోనేరుపల్లి: గ్రామంలోని భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ పి. నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రీ-సర్వే విస్తీర్ణం, సర్వే నంబర్లను కొలిచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో డిజిటల్ మ్యాపులను రూపొందించనున్నారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, GIS (Geographic Information System) మరియు DGPS (Differential Global Positioning System) వంటి అధునాతన సాంకేతికతను వినియోగించి ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ కోఆర్డినేట్లు కేటాయిస్తామని తెలిపారు. దీని ద్వారా భవిష్యత్తులో భూ సరిహద్దులపై తలెత్తే వివాదాలను నివారించడంతో పాటు భూ రికార్డులను మరింత ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు.

రీ-సర్వే పూర్తయిన తర్వాత భూమి ఎక్కడ ఉంది, దాని విస్తీర్ణం ఎంత, సరిహద్దులు ఎలా ఉన్నాయి వంటి వివరాలను డిజిటల్ మ్యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా పరిశీలించవచ్చని వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక భూ-నక్ష (BhuNaksha) పోర్టల్ లేదా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ల్యాండ్ రికార్డ్స్ వెబ్‌సైట్ల ద్వారా సంబంధిత భూమి FMB (Field Measurement Book) మ్యాప్ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించబడుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో భాగంగా భూముల రీ-సర్వే, రికార్డుల ప్రక్షాళన, డిజిటల్ పట్టాల జారీ, హక్కుల నమోదును పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేణుగోపాల్, సర్వేయర్ బి. శ్రీనివాస్, గిర్దావర్ టి. త్రిపాల్ సింగ్, జీపీఓ వీరేందర్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story