Manthani: తెలంగాణ ఆర్యవైశ్య యువజన కార్యదర్శిగా రావికంటి సతీష్!

Manthani: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మంథనికి చెందిన రావికంటి సతీష్ కుమార్ నియామకం. వాసవి కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం.

SHANKAR, MANTHANI
Published on: 2 Aug 2026 5:10 PM IST
Manthani
X

Manthani: తెలంగాణ ఆర్యవైశ్య యువజన కార్యదర్శిగా రావికంటి సతీష్!

జిల్లా: పెద్దపల్లి

రాష్ట్ర ఆర్యవైశ్య యువజన కార్యదర్శిగా రావికంటి సతీష్ కుమార్

Manthani పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన రావికంటి సతీష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని లక్డికాపూల్ వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు, యువజన ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు సమాజాభివృద్ధి, యువత సంక్షేమం, సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

రావికంటి సతీష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం పట్ల మంథని ప్రాంత ఆర్యవైశ్య సంఘ నాయకులు, వ్యాపారవేత్తలు, యువజన ప్రతినిధులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమాజాభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story