Rajanna Sircilla: మిడ్ మానేరు రిజర్వాయర్ అప్‌డేట్.. 8 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ..

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్ తాజా నీటి మట్టం వివరాలు. ప్రస్తుతం 8.024 టీఎంసీల నీరు నిల్వ. ఇన్‌ఫ్లోలు నిల్వ ఉండగా, ఆవిరి రూపంలో బయటకు వెళ్తున్న నీరు. పూర్తి నివేదిక ఇక్కడ.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 23 April 2026 7:11 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: మిడ్ మానేరు రిజర్వాయర్ అప్‌డేట్.. 8 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ..

బోయిన్‌పల్లి/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో ఉదయం 6 గంటల నాటికి నీటి మట్టం 307.54 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 27.55 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 8.024 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లోలు నమోదు కాలేదు. ఎస్‌వైపీ (గోదావరి పంప్ హౌస్), ఎస్‌ఆర్‌ఎస్‌పీ, అలాగే మానేర్, మూలవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా వరద నీరు రాలేదని తెలిపారు.

అవుట్‌ఫ్లో పరంగా మొత్తం 180 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇందులో ఆవిరీభవనం ద్వారా 135 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కులు నీరు వెలుపలికి వెళ్తోంది. మిగతా ఆర్‌ఎస్, ఆర్‌జీ, ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, ప్యాకేజ్-9, ప్యాకేజ్-10, జీసీఎల్ఎస్ మార్గాల్లో ఎలాంటి విడుదల లేదు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story