Karimnagar: కుట్రలు భగ్నం.. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టును నిలిపివేసిన హైకోర్టు!

Karimnagar: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు నిలిపివేయడంపై సుంకె రవిశంకర్ స్పందించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 22 April 2026 2:51 PM IST
Karimnagar
X

Karimnagar: కుట్రలు భగ్నం.. కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టును నిలిపివేసిన హైకోర్టు!

Karimnagar: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ స్పందిస్తూ, ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా బోగస్ అని, దాన్ని చెత్తబుట్టలో వేయాల్సిందేనని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ కమిషన్ ఏర్పాటుచేసిందని ఆరోపించారు. అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ కుట్రలు భగ్నమయ్యాయని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయలాంటిదని, రాష్ట్ర వ్యవసాయం మరియు నీటి అవసరాల పరంగా ఇది అత్యంత కీలకమని సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story