Manthani: మృగశిర స్పెషల్.. మంథని చేపల మార్కెట్‌లో కొనుగోలుదారుల రద్దీ!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో మృగశిర కార్తె సందడి. చేపల మార్కెట్‌లో భారీగా పెరిగిన కొనుగోలుదారుల రద్దీ.

SHANKAR, MANTHANI
Published on: 8 Jun 2026 12:01 PM IST
Manthani
X

Manthani: మృగశిర స్పెషల్.. మంథని చేపల మార్కెట్‌లో కొనుగోలుదారుల రద్దీ!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్ కళకళలాడింది. సంప్రదాయం ప్రకారం మృగశిర రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు భారీ సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. చేపల కొనుగోలుదారులతో మార్కెట్ మొత్తం సందడిగా మారింది.

మృగశిర కార్తె సందర్భంగా మంథని పట్టణంలోని చేపల మార్కెట్‌లో ఉదయం నుంచే కొనుగోలుదారుల రద్దీ కనిపించింది. పరిసర గ్రామాలతో పాటు పట్టణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున మార్కెట్‌కు చేరుకుని చేపలను కొనుగోలు చేశారు. మార్కెట్‌లో వివిధ రకాల చేపలను విక్రయానికి ఉంచారు.

అరకిలో నుంచి ఐదు కిలోల వరకు బరువున్న చేపలను వ్యాపారులు మార్కెట్‌కు తీసుకువచ్చారు. చేపల కోసం ప్రజలు పోటీపడి కొనుగోలు చేయడంతో వ్యాపారులు కూడా మంచి అమ్మకాలు జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్ అంతటా కొనుగోలుదారుల సందడి నెలకొంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మంచి డిమాండ్ ఉంది. ఉదయం నుంచే ప్రజలు వచ్చి చేపలు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద చేపలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

మృగశిర రోజున చేపలు తినడం మా సంప్రదాయం. మొత్తానికి మృగశిర కార్తె సందర్భంగా మంథని చేపల మార్కెట్‌లో ప్రజల రద్దీతో సందడి వాతావరణం నెలకొంది. చేపల కొనుగోలుకు ప్రజలు భారీగా తరలిరావడంతో చేపలు అమ్ముకునే వారికి మంచి వ్యాపారం జరిగింది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story