Jammikunta: జమ్మికుంట 28వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పర్యటన
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ 28వ వార్డులో పర్యటించారు.
Jammikunta: జమ్మికుంట 28వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పర్యటన
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని 28వ వార్డును సందర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ స్థానిక కౌన్సిలర్ ఒగ్గు రమేష్ ఆహ్వానం మేరకు కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తో కలిసి స్థానిక శిశుమందర్ పాఠశాల నుండి బద్రి షాప్ సెంటర్ వెళ్ళేటువంటి డ్రైన్ వల్ల పరిసర గృహవాసులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తుతం పరిష్కరించడం జరిగింది.
రానున్న రోజుల్లో కొత్త డ్రైన్ నిర్మాణం కోసం సహకరిస్తామని తెలుపుతూ కానీ రానున్న రోజుల్లో వర్షకాలంలో అధిక వర్షాల కారణంగా మళ్ళీ సమస్యలు తలెత్త అవకాశం ఉంటుంది కావున గృహ వసూలు కూడా ప్లాసిక్ బాటిల్స్,కవర్స్ ఇతర్త్ర డ్రైన్ లో పడేయకుండా చెత్త డబ్బాలలో వేసి చెత్త బండికి అందించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శీలం శ్రీనివాస్, బోళ్ళ సదానందం తదితరులు పాల్గొన్నారు.




