Peddapalli: సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీసీపీ

Peddapalli: సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేసిన పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి. ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం.

Srimanthula Kondal, Peddapalli
Published on: 24 July 2026 4:43 PM IST
Peddapalli
X

Peddapalli: సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీసీపీ

పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి (IPS) వార్షిక తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీకి పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికి, గౌరవ వందనం సమర్పించారు. ​

ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేస్ డైరీ (CD) ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ ఫైళ్లను డీసీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

​క్వాలిటీ ఇన్వెస్టిగేషన్: గ్రేవ్ కేసులు మరియు ఫోక్సో (POCSO) కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

​సిబ్బంది పర్యవేక్షణ: సీఐలు తరచుగా తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ, సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

​రౌడీషీటర్లపై నిఘా: సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి నెల వారి నూతన సమాచారాన్ని నమోదు చేయాలని చెప్పారు.

​ఫ్రెండ్లీ పోలీసింగ్: స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి గౌరవం ఇచ్చి, వారి సమస్యలను ఓర్పుగా వినాలి. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరిగేలా క్రమశిక్షణ, పారదర్శకతతో సేవలు అందించాలని సూచించారు.

​అవగాహన సదస్సులు: గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు మరియు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.

​కార్యక్రమంలో భాగంగా డీసీపీ పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి ఏసిపి జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story