Peddapalli: సబ్బితంలో వనమహోత్సవం: మొక్కలు నాటిన విప్ విజయరమణ రావు!

Peddapalli: పెద్దపల్లి మండలం సబ్బితంలో జరిగిన వనమహోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొని మొక్కలు నాటారు.

RAJU, PEDDAPALLI
Published on: 25 Aug 2026 9:54 PM IST
Peddapalli
X

Peddapalli: సబ్బితంలో వనమహోత్సవం: మొక్కలు నాటిన విప్ విజయరమణ రావు!

పెద్దపల్లి: పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొని మొక్కలు నాటారు.

పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో మంగళవారం రోజున వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామంలో మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం అనేది ప్రకృతికి చాలా మేలు చేస్తుందని అన్నారు. మొక్కల వల్ల వర్షాలు బాగా పడతాయని, పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు పచ్చని ప్రకృతిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా హరిత తెలంగాణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.

ఈ వనమహోత్సవ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ నరేష్ ముదిరాజ్, గ్రామ సర్పంచ్ నూనె రమేష్ - సరోజన, యూత్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి ప్రసాద్, మండల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామస్తులు కూడా ఉత్సాహంగా పాల్గొని పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story