Sultanabad: సుల్తానాబాద్ నూతన సీఐగా రంజిత్ రావు బాధ్యతల స్వీకరణ

Sultanabad: సుల్తానాబాద్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పొన్నమనేని రంజిత్ రావు బాధ్యతలు చేపట్టారు. గంజాయి నిర్మూలన మరియు పైరవీలు లేని పాలన తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. శాయంపేట నుండి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు.

KONDAL, SULTANABAD
Published on: 8 May 2026 7:45 PM IST
Sultanabad
X

Sultanabad: సుల్తానాబాద్ నూతన సీఐగా రంజిత్ రావు బాధ్యతల స్వీకరణ

సుల్తానాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పని చేస్తానని సుల్తానాబాద్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) పొన్నమనేని రంజిత్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన స్థానిక సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

గతంలో సుల్తానాబాద్‌లో విధులు నిర్వహించిన సీఐ సుబ్బారెడ్డి హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా శాయంపేటలో పని చేస్తున్న రంజిత్ రావును ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. బాధ్యతలు చేపట్టిన నూతన సీఐకి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ రంజిత్ రావు మీడియాతో మాట్లాడుతూ తన కార్యచరణను వివరించారు. ప్రాంతంలో గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వాడకంపై ఉక్కుపాదం మోపుతామని, మత్తు పదార్థాలను శాశ్వతంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ జవాబుదారీగా ఉంటామని తెలిపారు. సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేదా పైరవీలకు అవకాశం ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పి.చంద్రకుమార్ (సుల్తానాబాద్), దీకొండ రమేష్ (కాల్వ శ్రీరాంపూర్), ఎస్. వెంకటేష్ (పొత్కపల్లి), సీహెచ్ సనత్ కుమార్ (ఎలిగేడు), ఎల్.మధుకర్ (జూలపల్లి), అశోక్ రెడ్డి మరియు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story