Ramagundam: కమిషనరేట్ హెడ్క్వార్టర్స్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన సీపీ అంబర్ కిషోర్ ఝా, పోలీసు అధికారులు.
Ramagundam: కమిషనరేట్ హెడ్క్వార్టర్స్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
రామగుండం: రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్క్వార్టర్స్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరూ తాము ప్రారంభించిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని,ప్రజల కష్టాలను తొలగించి వారి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రజల మధ్య నెలకొన్న సోదరభావం,ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.పోలీస్ శాఖ సూచనల మేరకు ఆయా వినాయక మండపాల నిర్వాహకులు, యువత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో నేటి నుంచి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు.
ఈ పూజా కార్యక్రమంలో అదనపు డీసీపీ పరిపాలన కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఆర్ఐలు మల్లేశం, శేఖర్, రమేష్,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు తిరుపతి,సంఘం సభ్యులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




