Karimnagar: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఘటనలో 54 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 2:29 PM IST
Karimnagar
X

Karimnagar: త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఘటనలో 54 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురికావడంతో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సకాలంలో బస్సు బావిలో పడిపోకుండా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story