Gangadhara: మురుగు నీటిలో పందుల విహారం.. ప్రజల ఆందోళన

Gangadhara: గంగాధర మండలం మధుర నగర్ బస్ స్టాండ్ సమీపంలో నిలిచిన మురుగు నీరు. దోమల వ్యాప్తి, పందుల సంచారంతో స్థానికుల అవస్థలు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 24 April 2026 9:37 PM IST
Gangadhara
X

Gangadhara: మురుగు నీటిలో పందుల విహారం.. ప్రజల ఆందోళన

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధుర నగర్ బస్ స్టాండ్ సమీపంలో మురికి నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుదినాలుగా డ్రైనేజీ నీరు సరిగా వెళ్లక రోడ్డుపై మరియు పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉండటంతో దోమలు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో దోమల సమస్య మరింత తీవ్రమవుతోందని, చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా మురుగు నీటి ప్రాంతంలో పందులు స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ప్రజలు అంటున్నారు. పందుల సంచారం వల్ల అపరిశుభ్రత పెరిగి, ప్రజలు రాకపోకలకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురుగు నీరు తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, పందుల సంచారాన్ని నియంత్రించడం వంటి చర్యలు వెంటనే తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story