Sircilla: చిప్పలపల్లి సర్పంచ్ ‘మచ్చేటి లక్ష్మణ్’ అకాల మరణం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ మచ్చేటి లక్ష్మణ్ అకాల మరణం చెందారు.

KALEEM, SIRICILLA
Published on: 9 July 2026 10:26 AM IST
Sircilla
X

Sircilla: చిప్పలపల్లి సర్పంచ్ ‘మచ్చేటి లక్ష్మణ్’ అకాల మరణం

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ మచ్చేటి లక్ష్మణ్ మృతికి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు తోట అగన్న ఆధ్వర్యంలో నాయకులు లక్ష్మణ్ భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన గ్రామ సర్పంచ్ మచ్చేటి లక్ష్మణ్‌కు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట అగన్నతో పాటు పలువురు పార్టీ నాయకులు లక్ష్మణ్ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తోట అగన్న మాట్లాడుతూ.. మచ్చేటి లక్ష్మణ్ గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన సేవలను గ్రామ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే లక్ష్మణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు, మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రాజమల్లు, కల్వకుంట్ల శ్రీనివాస్, పడిగే ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story