Karimnagar: కరీంనగర్ జిల్లాలో సరికొత్త విద్యా విప్లవం.. 'బ్రిక్ టు బుక్స్' సక్సెస్
Karimnagar: కరీంనగర్ జిల్లాలో వలస కార్మికుల పిల్లల కోసం 'బ్రిక్ టు బుక్స్' వర్క్ సైట్ స్కూల్ ద్వారా విద్యా వెలుగులు.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో సరికొత్త విద్యా విప్లవం.. 'బ్రిక్ టు బుక్స్' సక్సెస్
కరీంనగర్: గంగాధర మండలంలోని గట్టుబూత్కూర్లో నిర్వహిస్తున్న “బ్రిక్ టు బుక్స్” వర్క్ సైట్ స్కూల్ ద్వారా వలస కార్మికుల పిల్లలకు విద్యా వెలుగు చేరుతోంది. విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టీలలో పని చేసే కార్మికుల కుటుంబాలకు చెందిన 66 మంది విద్యార్థులకు, ఐదు నెలల విద్యాభ్యాసం అనంతరం ప్రగతి పత్రాలు అందజేయబడ్డాయి. ఈ పిల్లల్లో చాలా మందికి ఇది మొట్టమొదటి విద్యా గుర్తింపు కావడం విశేషం. తల్లిదండ్రుల ఉపాధి కోసం తరచూ ప్రాంతాలు మారాల్సి వచ్చే పరిస్థితుల్లో కూడా, విద్యార్థులకు గణితం, ఆంగ్లం, చిత్రలేఖనం వంటి ప్రాథమిక నైపుణ్యాలపై దృష్టి సారించి బలమైన పునాది వేయబడింది.
ఈ ప్రగతి పత్రాలు కేవలం మార్కుల పత్రాలు కాదు—వీటివల్ల విద్యార్థులు ఎక్కడికెళ్లినా తమ విద్యను కొనసాగించేందుకు ఆత్మవిశ్వాసం, అవకాశాలు లభిస్తాయి. కరీంనగర్ జిల్లాలో వర్క్ సైట్ స్కూల్ విద్యార్థులకు ఈ విధంగా ప్రగతి పత్రాలు ఇవ్వడం మొట్టమొదటి సారి జరగడం గర్వకారణం. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్రకళ,జ్యోతి (వీవీ), కావ్య (వీవీ),సిఆర్పీ మధుకర్,ఎంఈఓ ప్రభాకర్ రావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




