Veerampalli: వీర్నపల్లిలో రాస్తారోకో.. బ్రిడ్జి పూర్తి చేయాలని గ్రామస్తుల డిమాండ్!

Veerampalli: వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 22 Jun 2026 10:13 AM IST
Veerampalli
X

Veerampalli: వీర్నపల్లిలో రాస్తారోకో.. బ్రిడ్జి పూర్తి చేయాలని గ్రామస్తుల డిమాండ్!

Veerampalli: వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పనులు ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఆటంకం కలుగుతోందని, విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలు పొందాల్సిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story