Khammam: కెమెరా కళ్ళకు చిక్కిన అడవి పుత్రులు!
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి అడవుల్లో జీవ వైవిధ్యం. చిరుతపులులు, జింకలు, ఇండియన్ బైసన్ల సంచారం.
Khammam: కెమెరా కళ్ళకు చిక్కిన అడవి పుత్రులు!
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు ప్రాంతాలలో జీవ వైవిధ్యం ఉట్టి పడుతుంది. కనకగిరి అడవుల్లో అటవి శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలలో చిరుత పులులు, జింకలు, దుప్పులు, ఇండియన్ బైసన్ లు, సాంబార్ల, ఎన్నో వన్యప్రాణులు దృశ్యాలు రికార్డు అయ్యాయి. వీటితో పాటు అందమైన పక్షులు కూడా ఉన్నట్లు వైల్డ్ ఎనిమల్ ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలలో బంధించారు. వేటాడే జంతువులతో పాటు ఇతర జాతులు సమృద్ధిగా ఉండటం పర్యావరణ సమతుల్యతకు నిదర్శనంగా అటవీ శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి ప్రాంతంలోని అటవి ప్రాంతం పర్యావరణానికి అణువుగా ఉందని చెప్పడానికి వన్య ప్రాణాలు మనుగడే ఒక ఉదాహరణ అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Next Story




