Bhadrachalam: హాజరైన వివిధ జిల్లాల డిపివోలు, పంచాయతీ అధికారులు!

Bhadrachalam: భద్రాచలం వైయస్ఆర్ నగరంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. పలు జిల్లాల DPOలు, పంచాయతీ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై పూజలు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 15 Sept 2026 8:17 AM IST
Bhadrachalam
X

Bhadrachalam: హాజరైన వివిధ జిల్లాల డిపివోలు, పంచాయతీ అధికారులు!

Bhadrachalam: భద్రాచలం పట్టణంలోని YSR నగర్‌లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి బొప్పన అనూష గారు దంపతులు , మహబూబాబాద్ జిల్లా DPO శ్రీ యాడారి రేవంత్ గారు, ఖమ్మం జిల్లా DPO శ్రీ G. వినోద్ కుమార్ గారు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా YSR నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీ దల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు వారికీ శాలువాతో సత్కారం చేసారు మరియు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాపయ్య,బాలయోగి,G. రవి, అప్పారావు, చందు, బాబురావు, సత్యనారాయణ, రాము,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.