Warangal: బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: మిస్ ఇండియా ఫిట్నెస్ అంబాసిడర్ ఫర్హా!
Warangal: వరంగల్ మామనూర్ పీటీసీలో యూత్ స్పీకింగ్ ఈవెంట్. యువతే దేశానికి బలమని పిలుపునిచ్చిన మిస్ ఇండియా ఫిట్నెస్ అంబాసిడర్ ఎం.ఎ. ఫర్హా. ఎన్సీసీ క్యాడెట్లలో నూతనోత్సాహం.
Warangal: బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: మిస్ ఇండియా ఫిట్నెస్ అంబాసిడర్ ఫర్హా!
వరంగల్: వరంగల్, మామనూర్ PTC: వరంగల్లోని మామనూర్ PTC లో నిర్వహించిన Youth Speaking Eventలో Miss India Fitness Ambassador & Changemaker M.A. Farha యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం చేశారు.
NCC కమాండెంట్ Col. S.K. Bhadra Sir గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన M.A. Farhaను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, NCC అధికారులు, ఇన్స్ట్రక్టర్లు, NCC క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా M.A. Farha మాట్లాడుతూ, “యువతే దేశానికి బలం, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉంది” అని అన్నారు. నేటి యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, మానసిక ఒత్తిడి, సామాజిక బాధ్యత వంటి అనేక సవాళ్లను ప్రస్తావిస్తూ, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు.
యువత కేవలం తమ వ్యక్తిగత విజయాల గురించి మాత్రమే కాకుండా, సమాజం మరియు దేశం కోసం కూడా ఏదైనా చేయాలనే ఆలోచనను పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, మంచి విలువలు మరియు సేవా భావం ప్రతి యువకుడి జీవితంలో ముఖ్యమైనవని వివరించారు.
“మన దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి యువకుడు బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలి. మనం దేశం నుంచి ఏమి పొందామనే దానికంటే, దేశానికి మనం ఏమి చేయగలమనే ఆలోచనతో ముందుకు సాగాలి” అని M.A. Farha అన్నారు.
ఆమె ప్రసంగం NCC క్యాడెట్లు, విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. యువతకు దిశానిర్దేశం చేస్తూ, దేశ సేవ పట్ల బాధ్యతను గుర్తుచేసిన ఈ Youth Speaking Event అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.




