Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పి.వి. మోహన్‌కు స్వాగతం!

Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసీసీ ఏపీ ఇన్‌చార్జ్ పి.వి. మోహన్. కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం, ప్రాంతీయ పార్టీలపై సుంకర పద్మశ్రీ తీవ్ర విమర్శలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 19 Sept 2026 11:26 AM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరం విమానాశ్రయంలో కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పి.వి. మోహన్‌కు స్వాగతం!

Gannavaram: బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ పివి మోహన్ జి. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లిన పీవీ మోహన్ జి.

ఈ సందర్భంగా ఏఐసీసీ మెంబర్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పివి మోహన్ ను ప్రత్యేక రాష్ట్ర ఇన్చార్జిగా రాహుల్ గాంధీ నియమించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు కార్యకర్తలు తరఫున పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నాం. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకుని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని కోరుకుంటున్నాం.

ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గా చేయటానికి దేశంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి పనిచేస్తాం. పీవీ మోహన్ జి వినబద్ధత గల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ బావ జలాలు గల వ్యక్తి, రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత నటిస్తాం చేసి మా సత్తా చూపిస్తాం.

రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలంతా మోడీకి తొత్తులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మా సత్తా చాటుతాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్