Bapuulapadu: పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం – జనసేన నేతలు
Bapuulapadu: హనుమాన్జంక్షన్లో జనసేన సమన్వయకర్త రమేష్ బాబు, సంయుక్త కార్యదర్శి రవివర్మ ప్రెస్ మీట్. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక.
Bapuulapadu: పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం – జనసేన నేతలు
బాపులపాడు: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో జనసేన గన్నవరం సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు, కృష్ణాజిల్లా సంయుక్త కార్యదర్శి చిమటా రవి వర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే వంశి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ
జగన్ హయాంలో రాష్ట్రం సర్వనాశనం అయిందని రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోసం జనసేన అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమితో పొత్తు కలపడం జరిగింది. జగన్కు చాలెంజ్ చేసి అదాహా పాతాళానికి తొక్కుతానని సవాల్ చేసి మరీ మీ పార్టీని లేకుండా చేశాడు. ఒక గంట మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రోడ్డుపైన నిలబడితే మీకు మీ పార్టీకి మీ నాయకులు మీ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయింది.
మా అధినేత పవన్ కళ్యాణ్ కు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకుని ఆంధీ అని బిరుదు ఇచ్చారు. మా నాయకుడు గురించి మాట్లాడటానికి మీకు అర్హత లేదు. మా అధినేత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం లో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంది. వంశీ నువ్వు గతంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి నోరు జారావు. మళ్లీ ఇది రెండోసారి.
ఆల్రెడీ జనసైనికులు అంటే ఏంటో నీకు చూపించాం. ఖబడ్దార్ జాగ్రత్త నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలగబెట్టావు. నియోజకవర్గంలో అన్ని దంతాలు బెదిరింపులు, కక్షపూరితమైన రాజకీయాలు. మహిళలను సైతం నమ్మగాని మాటలు అన్నావు, అక్రమ కేసులు పెట్టావు.
ఇప్పుడు మా నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు కూటమి ప్రభుత్వం సారథ్యంలో గన్నవరం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి అంటే ఇది. వంశి గుర్తుపెట్టుకో మళ్లీ ఇంకోసారి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం మేమేంటో చూపిస్తాం.




