Machilipatnam: మచిలీపట్నం చేరుకున్న గెల్లి జయలక్ష్మి పార్థివదేహం

Machilipatnam: వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన గెల్లి జయలక్ష్మి పార్థివదేహం మచిలీపట్నం చేరుకుంది. నివాళులర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర, స్థానికులు. విషాదంలో కుటుంబం.

Reddy, Pedana
Published on: 14 July 2026 5:28 PM IST
Machilipatnam
X

Machilipatnam: మచిలీపట్నం చేరుకున్న గెల్లి జయలక్ష్మి పార్థివదేహం

మచిలీపట్నం: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయలక్ష్మి భౌతికకాయం మచిలీపట్నం చేరుకుంది.మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో భౌతికకాయం చేరుకోగా అక్కడి నుంచి 'గ్రీన్ ఛానల్' ద్వారా అంబులెన్స్లో మచిలీపట్నంలోని సర్కిల్ పేటలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు.

శోకసంద్రంగా మారిన మారిన మచిలీపట్నం గెల్లి జయలక్ష్మి పార్థీవ దేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించిన బంధువులు పలువురు పుర ప్రముఖులు విదేశీ పర్యటనకు వెళ్లి బోటు ప్రమాదంలో విగత జీవిగా మారి మచిలీపట్నం చేరుకున్న జయలక్ష్మి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించిన ప్రజలు మరికాసేపట్లో అంత్య క్రియలు నిర్వహించనున్నారు.

Reddy, Pedana

Reddy, Pedana

Next Story