Ntr: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలను ఖండించిన మోదుగు ప్రసాద్

Ntr: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైఎస్సార్‌సీపీ నాయకులపై చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తిరువూరు మున్సిపల్ కార్యదర్శి మోదుగు ప్రసాద్ తీవ్రంగా ఖండించారు.

Venkateswara Rao, Tiruvuru
Published on: 9 Aug 2026 1:16 PM IST
Ntr
X

Ntr: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలను ఖండించిన మోదుగు ప్రసాద్

ఎన్టీఆర్ జిల్లా:

వైఎస్ఆర్సిపి నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఖండించిన తిరువూరుకు చెందిన జిల్లా మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి మోదుగు ప్రసాద్..

పేర్నినాని, దేవినేని అవినాష్, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు లపై అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ మొదుగు ప్రసాద్..

మా నాయకులపై వ్యక్తిగత,వారి మాట తీరును విమర్శించిన బోండా ఉమా..

మీ నాయకుడు మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాట్లాడే తీరును మర్చిపోయావా..

దేవినేని కుటుంబం చరిత్ర గురించి మాట్లాడావ్.. నీ చరిత్ర గురించి ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా..

గత ఐదేళ్లు కుక్కిన పెనులాగా ఉన్న నువ్వు. అధికారమదంతో మాట్లాడుతున్నావు..

నీ ఉడత బెదిరింపులకు వైసిపి నాయకులకు కాదు కదా కార్యకర్త కూడా బెదరడు..

మెగా డీఎస్సీ అక్రమాలపై దీక్ష చేస్తున్న వైసిపి నాయకులపై దాడి చేసి.. నీ పార్టీలో నీకు గుర్తింపు కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేశావు.

నీకు రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మర్చిపోవద్దు- మోదుగు ప్రసాద్..

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru

Next Story