Srisailam: మల్లన్న సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

Srisailam: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 5 Jun 2026 9:40 PM IST
Srisailam
X

Srisailam: మల్లన్న సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి

శ్రీశైలం: మహా పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం సాయంకాలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ జయ సూర్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి పూలమాలతో శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు అర్చక వేద పండితులు ఆహ్వానం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భ్రమరాంబ దేవి అలంకారం మండపంలో ఆశీర్వచన అర్చక వేద పండితులు చేశారు. అనంతరం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు స్వామి అమ్మవార్ల చిత్రపటం శేష వస్త్రాలు లడ్డు ప్రసాదం అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story