Markapuram: బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం!

Markapuram: మార్కాపురం గడియార స్తంభం వద్ద బ్యాంకు ఉద్యోగుల నిరసన.. ఐదు రోజుల పని దినాలు, ఎన్పీఎస్ రద్దు, పెన్షన్ అప్‌డేట్ చేయాలని డిమాండ్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 11 Sept 2026 12:51 PM IST
Markapuram
X

Markapuram: బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు సీపీఎం నాయకుల సంఘీభావం!

Markapuram: మార్కాపురంలో బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే పీఎల్‌ఐ విధానంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలని, పెన్షన్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు అందరికీ డీఏ ఫార్ములాను అమలు చేయాలని కోరారు. ఎన్‌పీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ విధానంలోకి మారే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సీపీఎం నాయకులు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకింగ్ యాజమాన్యాలు పరిష్కరించాలని వారు కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM