Banaganapalle: భార్యపై దాడికి యత్నించి.. కొడుకును హత్య చేసి పరారైన తండ్రి!
Banaganapalle: యనకండ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తు, కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రిస్తున్న కొడుకు మధును తండ్రి బాలమద్దిలేటి గొడ్డలితో నరికి చంపాడు.
Banaganapalle: భార్యపై దాడికి యత్నించి.. కొడుకును హత్య చేసి పరారైన తండ్రి!
Banaganapalle: బనగానపల్లె (మం) యనకండ్ల లో విషాదకర దారుణ ఘటన.
కన్న కొడుకును అత్యంత దారుణం గా గొడ్డలితో నరికి చంపిన తండ్రి.
నిద్రిస్తున్న కొడుకు మధు (30) అనే యువకుడిపై గొడ్డలితో దాడి చేసి నరికి చంపిన తండ్రి బాల మద్దిలేటి (56)
మధు తరచూ మద్యం సేవించడంతో ఇంట్లో గొడవలు జరిగాయి.
తండ్రి కొడుకులు మధ్య గత కొంత కాలంగా ఆస్తి తగాదాలు కుటుంబ కలహాలు.
కొడుకు తో పాటు భార్య సుబ్బమ్మ (50)ను కూడా చంపేందుకు యత్నించిన బాల మద్దిలేటి .
కళ్ళలో కారంపొడి కొట్టి తప్పించుకున్న భార్య సుబ్బమ్మ.
కొడుకును హత్య చేసి పరారైన భర్త బాల మద్దిలేటి శోకసంద్రం లో కుటుంబీకులు.
ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.
సమాచారం అందుకున్న బనగానపల్లె అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకొని హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.




