Kurnool: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై.. జనసేనలో చేరిన కోడుమూరు
Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతోంది.
Kurnool: పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై.. జనసేనలో చేరిన కోడుమూరు
కర్నూలు: కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామానికి చెందిన బి.చిత్రసేనుడు,బి.శ్రీనివాసులు, బి. శివకుమార్,M.శ్రీను,బి.రాము,బి.రమేష్,బి.శేషు కుమార్, బి.జయన్న మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది యువకులు పెద్దలు జనసేన పార్టీ సిద్ధాంతాలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ & పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారి సమక్షంలో ఆదివారం స్థానిక బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాంప్లెక్స్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కుమ్మరి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిబివి. సుబ్బయ్య గారు, కోడుమూరు నియోజకవర్గ నాయకులు సంధ్యా విక్రమ్ కుమార్ గారు,దినేదేవరపాడు లక్ష్మన్న, కృష్ణ బాబు, దేవమాడ జాన్, ఆకెపోగు విజయకుమార్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




